calender_icon.png 23 October, 2024 | 2:53 PM

సమస్యల పరిష్కారమే లక్ష్యం

12-08-2024 03:45:05 PM

ప్రజావాణికి 91 ఫిర్యాదులొచ్చాయి

జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు 

జగిత్యాల: ప్రజాసమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణిని అంతా వినియోగించుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 91 ఫిర్యాదులు, వినతులను (లోకల్ బాడీస్) గౌతమ్ రెడ్డితో కలసి స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. రాంబాబు మాట్లాడుతూ... సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికొచ్చిన 91 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  జగిత్యాల, కోరుట్ల,  ఆర్డీఓలు మధుసూధన్, ఆనంద్ కుమార్, జిల్లా కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు తదితరులు  పాల్గొన్నారు.