calender_icon.png 26 October, 2024 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

01-09-2024 08:33:41 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 2న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ (08736-250501) ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవల నిమిత్తం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.