calender_icon.png 4 March, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

03-03-2025 04:23:21 PM

తహసీల్దార్ సంజయ్ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): దోమకొండ మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సంజయ్ రావు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలందరూ వారి సమస్యలను పరిష్కారించుకోవాలని సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారిని మణిదీపిక, ఏపీవో రజిని, ఎక్సైజ్ సిబ్బంది, బీసీ హాస్టల్ వార్డెన్ ఉన్నారు.