17-03-2025 03:53:11 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం తహశీల్దార్ జ్యోత్స్న ఆధ్వర్యంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపీడీవో మహేందర్, ఎంపీఓ వెదల శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో ఎస్తేర్ డేవిడ్, ఐకెపి ఏపిఎం శ్యామల, తాళ్ల గురిజాల ఏఎస్ఐ మజార్, వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ లతోపాటు ఆర్డబ్ల్యూఎస్, హార్టికల్చర్ అధికారులు పాల్గొని ప్రజల నుండి సమస్యలపై వచ్చిన ఆర్జీలను స్వీకరించారు.