జెండా ఆవిష్కరించిన సిపి శ్రీనివాస్
పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం సీపీ శ్రీనివాస్ మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఆర్ఐ దామోదర్, ఆర్ఎస్ఐ శ్రావణి, వెంకట్, సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.