calender_icon.png 1 October, 2024 | 7:05 AM

డ్రా చేసుకున్న ప్రజ్ఞా, అర్జున్

19-09-2024 12:01:10 AM

బుడాపెస్ట్: 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భాగంగా బుధవా రం ఏడో రౌండ్‌లో భారత పురుషుల జట్టు చైనాతో.. మహిళల జట్టు జార్జియాతో తలపడ్డాయి. పురుషు ల విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. గ్జియాంగి తో, మరో గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. యాంగ్యితో గేమ్‌లను డ్రాగా ముగించుకున్నారు. ఇక మహిళల విభాగంలో ఆడిన ఆరింటిలో ఐదు విజయాలు నమోదు చేసిన దివ్య దేశ్‌ముఖ్.. బట్సియావితో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకుంది.