10-02-2025 04:49:37 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం, ప్రభాత్ నగర్ రేగు కృష్ణమూర్తి ఇంటి దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) గ్రామ శాఖ మహాసభ నిర్వహించి, నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ... కమ్యూనిస్టులు విశాల దృక్పథం కలిగి ఉంటారని, సిపిఐ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగి లేదని, ప్రజలలో మమేకమై అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో 10 లక్షల ఎకరాలు భూస్వాముల భూములు పేదలకు పంచిపెట్టిందని, తర్వాత కాలంలో ఎత్తుగడల పేరుతో ఎర్రజెండా పార్టీలుగా కొన్ని సంస్థలు ఏర్పడినా... అవి చివరకు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని పేద, మధ్యతరగతి ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని వారి తరఫున పోరాడి సమస్యలు పరిష్కరించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
సభలో 15 మందితో నూతన శాఖ సభ్యులను ఎన్నుకొన్నారు. శాఖ కార్యదర్శిగా బోళ్ల ఉపేందర్ రెడ్డి సహాయ కార్యదర్శిలుగా రేగు కృష్ణమూర్తి.గొనె క్రాంతిలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సభలో సిపిఐ పార్టీ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు సిపిఐ మండల నాయకులు నిమ్మల రాంబాబు, శనిగారపు శ్రీనివాసరావు ఆవుల సతీష్ వేల్పుల లింగయ్య దొంతో జి వెంకన్న చారి సోమ రామిరెడ్డి తిరుమ రెడ్డి నారాయణరెడ్డి వడ్లకొండ అనిల్ రేగు హేమలత బోళ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.