హైదరాబాద్: పాన్ ఇండియా కథానాయకుడు ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత ఈ యంగ్ రెబెల్ స్టార్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది రాజాసాబ్' చిత్రం టీజర్ విషయంలో గత కొన్ని రోజులుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న ఈ చిత్రం టీజర్ను విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఆ వార్తలన్నీ అవాస్తవమని దర్శకుడు మారుతి సన్నిహితులు అంటున్నారు.ప్రభాస్ బర్త్ డే నాడు టీజర్ లేదు కానీ దర్శకుడు మారుతి సమ్ థింగ్ స్పెషల్ ప్రమోషన్ కంటెంట్ ను ప్రభాస్ అభిమానులకు అందించనున్నారని తెలిపారు. కాగా ఏప్రిల్ 2025లో ది రాజా సాబ్ చిత్రం థియేటర్ లలోకి రానుందని తెలియజేశారు.