calender_icon.png 21 September, 2024 | 2:03 AM

గంజాయి మొక్కల స్వాధీనం

21-09-2024 12:02:03 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మిర్చి తోటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ డివిజన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వట్‌పల్లి మండలంలోని మ ర్వెల్లి గ్రామంలో మిర్చి తోటలో గం జాయి సాగు చేస్తున్నారని విశ్వసనీ య సమాచారం రావడంలో శుక్రవారం దాడులు నిర్వహించి స్వాధీ నం చేసుకున్నట్లు వెల్లడించారు. 20 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామని, జుట్ట చిన్న నర్సింహులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని జోగిపేట పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్  సీఐ వీణారెడ్డి, ఎస్సై అ నిల్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.