మంచిర్యాల, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసిన వ్యక్తిని దండేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. శుక్రవారం లక్షెట్టిపేట సీఐ కార్యా లయంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వివరాలు వెల్లడించారు. దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెం దిన రామడుగు లక్ష్మణ్రావు వీఆర్వో గా పనిచేసి పదవీ విరమణ పొంద గా.. 2006లో మృతి చెందాడు. లక్ష్మ ణ్రావు పేరు మీద అ ల్లీపూర్ గ్రామ శివారులో 1.33 ఎకరాల పట్టా భూమి ఉన్నది.
లింగాపూర్కు చెంది న అజ్మీరా హరినాయ క్ గుర్తు తెలి యని వ్యక్తి వేలిముద్ర వేయించి లక్ష్మ ణ్ రావు వేలిముద్ర అని మోసం చేసి రూ.82 వేలకు 199 8, ఏప్రిల్ 11న వి క్రయించినట్లుగా నకిలీ సాదాబైనా మా సృష్టించాడు. లక్ష్మణ్రావు సోదరుడు మురళీధర్రావు ఫిర్యాదు మేర కు అజ్మీరానాయక్ను శుక్రవారం అదుపులోకి తీ సుకొని కోర్టులో హజరుపర్చామన్నారు.