calender_icon.png 2 April, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

01-04-2025 05:02:32 PM

మండల పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి..

మునగాల: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న సన్నబియ్యాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం  సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని అన్ని గ్రామాలలో రేషన్ షాప్ ల వద్ద ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం దళారులకు విక్రయించకూడదని వాడుకోవాలని తెలిపారు. బియ్యం అక్రమ రవాణా జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, ఉప్పుల యుగంధర్ రెడ్డి, ఉప్పుల జానకి రెడ్డి కాసర్ల శ్రీనివాస్ (బోస్) గ్రామ శాఖ అధ్యక్షుడు ఈదరావు, గంధం సైదులు, తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ రేషన్ డీలర్ అసోసియేషన్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.