అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాల్ని పంచుకున్నారు.
‘తండేల్’ ఎలా స్టార్ట్ అయ్యింది ?
నా క్లాస్ మేట్ భాను. తను కో ప్రొడ్యూసర్ గా కూడా చేస్తాడు. రైటర్ కార్తిక్ దగ్గర ఈ కథ విని బావుందని నా దగ్గరికి తీసుకొచ్చాడు. కార్తిక్ చెప్పిన కథలో ఎసెన్స్ నాకు చాలా నచ్చింది. కార్తికేయ 2 తర్వాత చందుని ఈ కథ వినమన్నాను. తనకీ చాలా నచ్చింది. ఈ విషయాలన్నీ చెప్పడానికి రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ని చందు డిజైన్ చేశారు. ఇది ప్యూర్ లవ్ స్టొరీ. ఇది యాభై శాతం ఫిక్షన్. యాభై శాతం నాన్ ఫిక్షన్.
తండేల్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
డీ -మత్స్యలేశం అనే ఊరుని బేస్ చేసుకుని తీసుకున్న కథ ఇది. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్కి ఫిషింగ్కి వెళ్తారు. అక్కడ బోట్లు ఉన్న వారికి బిరుదులు ఉంటాయి. మెయిన్ లీడర్ ని తండేల్ అంటారు. ఇది గుజరాతీ వర్డ్.
చైతన్యకు ఈ కథ ఎప్పుడు చెప్పారు?
నాలుగేళ్ల క్రితం ఓ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఈ మధ్య విన్న మంచి కథ ఏమిటని అడిగారు. అప్పుడు ఈ కథ గురించి చెప్పాను. ఆయనకి పాయింట్ నచ్చి మనం చేస్తున్నామని అన్నారు. అయితే ఇందులో ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్, సముద్రంలోకి వెళ్లిన తర్వాత నెలల పాటు స్నానం ఉండదు.. యాస ఇలా కొన్ని సమస్యలున్నాయని చెప్పా. ‘నేను వర్క్ చేస్తా’ అని చెప్పారు. ఆయన ఈ పాత్ర కోసం మౌల్డ్ అయిన విధానం అద్భుతం. శివుని పాటలో సాయి పల్లవి చైతు డ్యాన్స్ థియేటర్స్లో పూనకం తెప్పిస్తుంది.
ఇందులో సీజీ వర్క్ ఉందా?
ఇందులో తుపాను ఎపిసోడ్ తప్పితే మిగతా సీన్స్ అన్నీ ఒరిజినల్ సముద్రంలోనే షూట్ చేశాం. ఈ సినిమాకి చేసినంత అవుట్ డోర్ ఏ సినిమాకి చేయలేదు.
ట్రైలర్లో దాదాపుగా కథ చెప్పిన భావన కలిగింది?
ట్రైలర్ లో చూసింది తక్కువే. అందరికి తెలియనిది సినిమాలో చాలా వుంది. జైల్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఎదురుకున్నారో ఎవరికీ తెలీదు. సినిమాలో చాలా ఇంట్రస్టింగ్ కంటెంట్ వుంది.
డైరెక్టర్ చందు మొండేటి గురించి... ప్రేమమ్ లాంటి కల్ట్ సినిమా రీమేక్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ సినిమాని ఆయన ప్రజెంట్ చేసిన తీరుకి సర్ప్రైజ్ అయ్యాను. తనలో సమ్ థింగ్ ఉందనిపించింది.