29-04-2025 12:17:12 AM
కూసుమంచి , ఏప్రిల్ 28 :-కూసుమంచి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి అన్నారు .. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కరుణశ్రీ కి వినతి పత్రం సమర్పిం చారు.ఎండ కాలం వస్తె నిలబడడానికి నిలువ నీడ లేదని అన్నారు.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీని నిలబెట్టుకోని బస్టాండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు..వద్దెంపూడి నరేష్ ,బద్దం వెంకటరెడ్డి ,పిట్టల వేణు , ఎస్.కె బాబా ఉన్నారు..