calender_icon.png 3 October, 2024 | 6:02 AM

వరద ప్రాంతాల్లో ఆహారం, తాగునీటికి ఇబ్బంది రావొద్దు

03-09-2024 06:51:12 PM

హైదరాబాద్: వరద బాధితులకు సహాయక చర్యలపై అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి అన్నారు. యుద్ధ ప్రాతిపదికను పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రవ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యల వల్ల 3 వేల మందిని రక్షించగలిగామని పొంగులేటి వెల్లడించారు. వరద ప్రాంతాల్లో ఆహారం, తాగునీటికి ఇబ్బంది రావొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు.