మేడ్చల్, మే 4 (విజయక్రాంతి) : కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నట్లు మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌత మ్ తెలిపారు. శనివారం నియోజకవర్గానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రియాంక శుక్ల, కంటోన్మెంట్ జాయింట్ సీఈవో ఆకాశ్ కుమార్శర్మ, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి సమక్షంలో బ్యాలెట్ యూనిట్, కంట్రో ల్ యూనిట్, వీవీ ప్యాట్స్ల రెండోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గౌతమ్ మాట్లాడుతూ 232 పోలింగ్ కేంద్రాలకు 580 బ్యాలెట్ యూనిట్లు, 290 కంట్రోల్ యూనిట్లు, 324 వీవీ ప్యాట్స్ను కేటాయించారు.