calender_icon.png 19 October, 2024 | 3:33 PM

పదోన్నతి ద్వారా పోలీసులకు మరింత బాధ్యత పెరుగుతుంది

19-10-2024 01:17:34 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పదోన్నతి ద్వారా పోలీసులకు మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 6 గురు అధికారులకు సీపీ అభినందించి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. కష్టపడి పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వహించారో అదే విధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్ లు, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.