- రెండు కి.మీ. వరకు గుంతల పూడ్చివేత
- శభాష్ పోలీస్.. అంటున్న ప్రజలు
జగిత్యాల, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన వరాలతో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని బుగ్గారం ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీం తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుర్తించిన పోలీసులు ఆదివారం శ్రమదానం చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గుంతల్లో ట్రాక్ట ర్లతో మొరం పోయించి పూడ్చివేశారు. మొరంపై చిప్స్ డస్ట్ కలిపి పోసి పూర్తి లెవలింగ్ చేశారు. గుంతలు పూడ్చి వాహనాల రాకపోకలకు సుగమనం చేసినందుకు ప్రజ ల మన్ననలు పొందుతున్నారు. శ్రమదానం లో ఎస్సై శ్రీధర్రెడ్డి, ధర్మపురి సీఐ రామ్నరసింహరెడ్డి, ఆర్ఐ బాపురెడ్డి, హెడ్ కాని స్టేబుల్ పులి రవి కుమార్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.