calender_icon.png 9 October, 2024 | 10:04 AM

స్కూల్ భవనం నిర్మించిన పోలీసులు

08-10-2024 12:36:09 AM

ప్రారంభించిన ఎస్పీ రోహిత్‌రాజు

చర్ల, అక్టోబర్ 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు మంచి మనుసు చాటుకున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామమై న చర్ల మండలం బూరుగుపాడులో విద్యార్థుల అవస్థలు చూడలేక పాఠశాల భవనాన్ని నిర్మించారు. సోమవారం ఎస్పీ రోహిత్‌రాజు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూరుగుపాడులో శిథిలావస్థకు చేరిన గుడిసెలో విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.

వారి ఇబ్బందులు చూడలేక చర్ల పోలీసులు శాశ్వత పాఠశాల భవనాన్ని నిర్మించడం గొప్ప విషయమని చెప్పారు. ఆదివాసీ ప్రజలను అభివృద్ధి మార్గంలో పయణించేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చర్ల సీఐ రాజువర్మ నేతృత్వంలో నిర్మించిన పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రతిరోజు హాజరై మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సాయిమనోహర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం వీరస్వామి పాల్గొన్నారు.