calender_icon.png 24 October, 2024 | 11:06 PM

సైబర్ నేరాలు నివారించేందుకు పోలీసులు కృషి చేయాలి

24-10-2024 08:39:46 PM

గుమ్మడిదల,(విజయక్రాంతి): సైబర్ నేరాలు నివారించేందుకు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. గురువారం ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఐడిఏ బొల్లారం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఇతర రాష్ట్రాల చెందిన కూలీలు పని చేస్తారని వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాలు నివారించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పరిరక్షణ చేయాలన్నారు. అమీన్పూర్ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారని దొంగతనాలు నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఐడిఏ బొల్లారం సీఐ గంగాధర్, ఎస్సై రాములు తదితరులు పాల్గొన్నారు.