16-04-2025 12:26:55 AM
అడిషనల్ డీజీపీ వి వి శ్రీనివాస రావు
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): పోలీసులు వృత్తిని దైవంగా భావించి, క్రమశిక్షణతో పనిచేయాలని అడిషనల్ డీజీపీ, ఆర్ బి వి ఆర్ ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వి.వి శ్రీనివాసరావు అన్నారు. మేడ్చల్ మండలం కండ్లకోయ పరిధి లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుల్స్ కు దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన శిక్షణ పూర్తిచేసుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇతర రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలకు దిక్సూచిగా ఉందని , తెలంగాణ ప్రభుత్వం పోలీసుల కుటుంబాలకు విద్యా, ఇతర సంక్షేమ పథకాలను అమలుచేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ తొమ్మిదినెలల కఠోర శ్రమ తరువాత మీరు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ,మీరందరూ మంచి నడవడిక , క్రమ శిక్షణ , నైతిక విలువలతో మీ భాద్యతలను నిర్వ ర్తించాలని తద్వారా రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చాలని ఆయన తెలిపారు.
అనంతరం కళాశాలలో నూతనంగా నిర్మించిన ఫౌంటైన్ లను , సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ , ఫోరెన్సిక్ ల్యాబ్ , సి సి టి వి లను ముఖ్య అతిథి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో యూసుఫ్ గూడ బెటాలియన్ కమాండెంట్ పి. మురళీకృష్ణ ,పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డి ఎస్ పి లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు .