calender_icon.png 30 September, 2024 | 3:31 PM

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు

30-09-2024 01:58:17 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో మొర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారు వాహనాలను సోమవారం పాల్వంచ పట్టణ పోలీసులు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పి సతీష్, పాల్వంచ సీఐ వినయ్ కుమార్, పట్టణ ఎస్సైలు సుమన్, రాఘవయ్య లు పలు చోట్ల తనిఖీలు చేసి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. గృహ అవసరాలకు పేరుతో ఇసుక సురులు ఇతర ప్రాంతాలకు లారీల, ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారని చేస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసు తనిఖీల్లో భాగంగా ఇప్పటికే పలు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని పాల్వంచ పట్టణ ఎస్ఐ సుమన్ కోరారు.