ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోలీసు అమర వీరులు త్యాగాలు మరువలేనివని ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపారు. ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమర వీరులకు జోహర్లు, పోలీసు అమర వీరుల ఆశయాలు సాధిస్తాం, సాధిస్తాం అంటు నినాధాలు చేస్తు ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, నర్సింహ్మ, శ్రీకాంత్, శేఖర్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.