ఎల్బీనగర్, సెప్టెంబర్ 22: గుట్టుచప్పుడు కాకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చింతలకుంట పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సుబ్బయ్యగారి హోటల్పైన హుక్కా సెంటర్ నిర్వహి స్తున్నారనే సమాచారం మేరకు శనివారం సా యంత్రం వనస్థలిపురం సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్వంలో ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో కలిసి దాడి చేసి నిర్వాహకులైన మహమ్మద్ సోయాబుద్దీన్, స య్యద్ సిరియాదులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.