calender_icon.png 21 October, 2024 | 1:05 PM

గోషామహల్ స్టేడియంలో పోలీస్ సంస్మరణ కార్యక్రమం

21-10-2024 10:32:00 AM

హైదరాబాద్: హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల ప్లాగ్ డే పరేడ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన పోటీలు పెట్టారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లో సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీఎస్ ల పరిధిలో రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు తీస్తున్నారు. పోలీసు కళాబృందాలతో ఈ నెల 31 వరకు ప్రధాన కూడళ్ల వద్ద కళాజాత, నేటి నుంచి పదిరోజుల పాటు పోలీసుల సంస్మరణ కార్యక్రమం కొనసాగనుంది. విధినిర్వహణ ఆధునిక సాంకేతిక వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.