calender_icon.png 23 September, 2024 | 12:57 PM

గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసుల బందోబస్తు

23-09-2024 10:16:21 AM

సికింద్రాబాద్,(విజయక్రాంతి): గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల బీఆర్ఎస్ కమిటీ వేసింది. ఈ క్రమంలోనే సోమవారం కమిటీ సభ్యులు సంజయ్ రాజయ్య, మెతుకు ఆనంద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ నేతల పర్యటన దృష్ట్యా కమిటీ సభ్యులను ఆసుపత్రిలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నేతలు సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఆసుపత్తులపై అధ్యయనం చేస్తామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని, ప్రభుత్వం వైఫల్యం బయటపడుతుందని భయపడుతున్నారా అని ప్రశ్నించారు.