calender_icon.png 24 October, 2024 | 11:48 PM

పోలీసులపై పని భారాన్ని తగ్గించాలని కుటుంబ సభ్యుల నిరసన

24-10-2024 09:16:07 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): పోలీసులపై పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురు వారం వారి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట 13వ బెటాలియన్ ముందు పోలీసుల కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని పోలీసుల సెలవుల విధానం మార్చాలని, పని భారం తగ్గించాలని, పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రంలోనూ అదే తరహా వ్యవస్థను అమాలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా అమలులోకి వచ్చే రికార్డు పద్దతిని ఉపసంహరించుకోవాలని, పని భారాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరారు. బెటాలియన్ వ్యవస్థలోనూ ఐదేండ్ల వరకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెటాలియన్ కమాండెంటు రాములు సంఘటన స్థలానికి చేరుకొని పై అధికారులకు సమస్య విన్నవిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.