calender_icon.png 23 October, 2024 | 3:19 AM

రోడ్డెక్కిన పోలీసు కుటుంబాలు

23-10-2024 01:00:22 AM

ఒకే పోలీస్-ఒకే రాష్ట్రం విధానం అమలుకు డిమాండ్ 

జనగామ/హనుమకొండ, అక్టోబర్ 22 (విజయక్రాంతి): పోలీసుల సమస్యలు తీర్చాలని కోరుతూ వారి కుటుంబాలు రోడ్డెక్కా యి. మంగళవారం వరంగల్ జిల్లాలోని ఖిల్లాలోని వరంగల్ మండలం ఫోర్త్ బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ‘ఒకే పోలీ స్.. ఒకే రాష్ట్రం’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎప్పుడు ఎక్కడ విధు లు కేటాయిస్తారో అర్థం కాని పరిస్థితు ల్లో ఫోర్త్ బెటాలియన్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఎనిమి ది గంటలకు మించి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.