దందాలు చేసే ఐదుగురు బైండోవర్
అక్రమ దందాల వ్యాపారులు పద్ధతి మార్చుకోవాలి
లేకుంటే కఠిన చర్యలు.. మంథని ఎస్ఐ రమేష్ హెచ్చరిక
మంథని (విజయక్రాంతి): మంథనిలో అక్రమ దందాలకు మంథని పోలీసుల చెక్ పెడుతున్నారు. దందాలు చేసే ఐదుగురని బైండోవర్ చేశారు. మంథని పట్టణానికి చెందిన మండలంలోని రాచర్ల రమేష్, వేముల మహేష్, భీమినేని రాజేష్, బుద్ధార్థి సమ్మయ్య, కాసు రాజ్ కుమార్ లు ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వ్యాపారం చేశారని, వీరిని ఇక ముందు ఈ అక్రమ దందా చేయకుండా, బియ్యంను తరలించకుండా ఉండడానికి గాను ముందస్తుగా మంథని తహసీల్దార్ రాజయ్య ముందు బైండోవర్ చేశామని, మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు. మంథనిలో ఇకమీదట ఎవరైనా అక్రమ దందాలు చేసేవారు మానుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.