calender_icon.png 24 October, 2024 | 2:40 PM

చిలుక ప్రవీణ్ పై బెల్లంపల్లిలో కేసు నమోదు

24-10-2024 12:03:45 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని పెరికపల్లి గ్రామానికి చెందిన సింగతి మల్లేష్, సింగతి నరేందర్ ల మధ్య తలెత్తిన భూ వివాదం కారణంగా ఒకరినొకరు కొట్టుకొని తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలను సింగతి నరేందర్ యూట్యూబ్, ఫేస్బుక్ లలో అప్లోడ్ చేశాడని తెలిపారు. దీనిని ధర్మసాగర్ కు చెందిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ మరో విధంగా వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినందునే కాంగ్రెస్ పార్టీ కి చెందిన వ్యక్తులు సింగ తి నరేందర్ పై గొ డ్డలితో దాడి చేశారని తప్పుడు సమాచారం పెట్టి ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో విద్వేషాలు సృష్టిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపి రవికుమార్ స్పష్టం చేశారు.