calender_icon.png 21 October, 2024 | 3:26 AM

పలు పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

20-10-2024 08:06:36 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): పలు పేకాట స్థావరాలపై పోలీసులు దాడి నిర్వహించి 15 మంది పేకాట రాయులను అరెస్టు చేశారు. ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంతోపాటు మండలంలోని విఠల్వాడి గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పేకాట స్థావరాలపై దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. పేకాటరాయులపై కేసు నమోదు చేశామని, మండల పరిధిలో ఎక్కడైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ మహేందర్ పేర్కొన్నారు.