calender_icon.png 20 September, 2024 | 9:15 PM

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

26-07-2024 09:59:02 PM

సికింద్రాబాద్: హైదరాబాద్ లో గంజాయిపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. తాజాగా నగరంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి రూ.4 లక్షలు విలువైన 16 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి విచారించగా ఇచ్ఛాపురం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా వెల్లడించాడు. దీంతో నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.