31-03-2025 06:48:49 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసులబాలరాజు ఈద్గా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండగ సందర్భంగా బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.