17-04-2025 04:01:16 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగా మహిళలకి అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై ఉచిత కుట్టు మిషన్ లను మహిళ లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యాక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దయానంద్, పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.