calender_icon.png 7 March, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొన్న పోచారం

07-03-2025 12:00:00 AM

బాన్సువాడ, మార్చి 6(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం దోమలెడిగి గ్రామంలో గురువారం నిర్వహించిన 8వ అఖండ హరినామ సప్తహా కార్యక్రమం  రుక్మిణీ పాండురంగ విగ్రహ ప్రతిష్టాపన  కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ఉత్సవాలకు ముఖ్యతిథిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం విఠలేశ్వర స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయన  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాండురంగా స్వామి భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.