27-02-2025 02:09:59 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): బాన్స్ వాడ డివిజన్ కేంద్రంలోని సోమేశ్వరం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని భక్తులకు మహ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోమేశ్వర్ గ్రామం శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను బుధవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. బాన్సువాడ నియోజక వర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పోచారం వెంట ఉన్నారు.