07-04-2025 07:07:09 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని తాడుకోలు చౌరస్తాలో నాగులగామ గిర్మయ్య జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు నాగులగామ వెంకన్న గుప్తా ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వేసవిలో ప్రజల కోసం నీరు, అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.