ముంబై: మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పర్యటిస్తున్నారు. రూ. 56 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ముంబయిలో రూ.14,120 కోట్లతో అండర్ గ్రౌండ్ మెట్రో ఫేజ్-3 ఆయన ప్రారంభించారు. 18వ విడుత కిసాన్ సమ్మాన్ యోజన కింద రూ. 20 వేల కోట్లను ప్రధాని రైతుల ఖాతాల్లోకి మళ్లించారు. పీఎం-కిసాన్ పథకం ద్వారా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. పంట సాయంగా రైతులకు ఏడాదికి రూ. 6 వేలను కేంద్రం అందిస్తోంది. ఎన్డీయేనే రైతులకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలకు విమర్శలే పని.. రైతులను ఎలా ఆదుకోవాలో తెలియదని పేర్కొన్నారు.