calender_icon.png 23 September, 2024 | 4:48 PM

అమెరికా స్టేజ్‌పై అలయ్ బలయ్

23-09-2024 02:01:36 PM

వాషింగ్టన్: అమెరికాలో స్టేజిపై మన దేవిశ్రీ ప్రసాద్ ని ప్రధాని నరేంద్రమోడీ హత్తుకున్నారు. పుష్ప శ్రీవల్లి పాటతో.. స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోడీ దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినందించారు. ప్రధాని అమెరికా పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సు ఏర్పాటు చేయగా ప్రధాని మోడీ దీనికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో అనేకమంది ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వగా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు.