calender_icon.png 19 October, 2024 | 4:05 PM

రష్యా పర్యటనకు ప్రధాని మోదీ

19-10-2024 01:33:49 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యా పర్యటన ఖరారైంది. మాస్కో అధ్యక్షతన వచ్చేవారంలో జరగనున్న బ్రిక్స్ సదస్సు లో మోదీ పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలని స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈ నెల 22 నుంచి 23 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది.