calender_icon.png 8 October, 2024 | 7:44 PM

‘గర్భా’పై ప్రధాని మోదీ పాట

08-10-2024 01:41:07 AM

ఆలపించిన గాయని పూర్వా మంత్రి

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దసరా దేవీనవరాత్రులను పురస్కరించుకొని గుజరాతీ నృత్యమైన గర్భాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా పాటను రాశారు. దీన్ని గాయిని పూర్వా మంత్రి ఆలపించారు. ప్రధా ని మోదీ సోమవారం తన ఎక్స్ అకౌంట్‌లో ఆ పాట వీడియోను షేర్ చేశారు. ‘ఈ పవిత్ర దినాల్లో ప్రజలు దుర్గాదేవిని ఐక్యంగా ఆరాధిస్తారు.

ఈ ప్రత్యేక సమయంలో అమ్మ వారి శక్తి, దయను కీర్తిస్తూ అవటికలయ అనే గర్భా పాటను రాశాను. మనందరిపైనా అమ్మవారి కృప ఉండాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. వర్ధమాన గాయిని పూర్వామంత్రి తన అద్భుతమైన స్వరంతో ఈ పాటను ఆలపించారని ప్రధాని మరో పోస్ట్‌లో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ గర్బాపై ప్రత్యేకమైన కవితను రాశారు.