calender_icon.png 21 September, 2024 | 12:16 PM

జమ్ముకశ్మీర్ రూపురేఖలు మారుస్తున్నాం

19-09-2024 01:07:01 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో కాశ్మీర్ లో హిందువులు, సిక్కులపై దాడులు జరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ శ్రీనగర్ లో ఎన్నికల ప్రచారంలో అన్నారు. జమ్ముకశ్మీర్ కు అనే పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. తాము వచ్చాక జమ్ముకశ్మీర్ రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్ముకశ్మీర్ లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కాశ్మీర్ లో బంద్ ఎప్పుడూ జరగలేదని తెలిపారు. జమ్ముకశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జమ్ముకశ్మీర్ లో ఎవరి పనులు వాళ్లు ప్రశాంతంగా చూసుకుంటున్నారని తెలిపారు. జమ్ము కాశ్మీర్ ప్రజల వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.