calender_icon.png 28 October, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రతన్ టాటా ఆత్మ సంతోషిస్తుంది: ప్రధాని మోడీ

28-10-2024 01:35:04 PM

వడోదర: మహారాష్ట్ర వడోదరలో సైనిక రవాణా విమానాల ఉత్పత్తి పరిశ్రమను సోమవారం స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ  పరిశ్రమను నిర్మించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... ఈ పరిశ్రమ భారత్- స్పెయిన్ సంబంధాలను బలోపేతం చేస్తోందని చెప్పారు. ఈ పరిశ్రమలో మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ మిషన్ బలోపేతం అవుతూందన్నారు.

ఇక్కడ తయారైన ఎయిర్ క్రాఫ్ట్ర్ లను విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. భవిష్యత్తులో భారత్ లోనే పౌర విమానాలు తయారు చేస్తామని మోడీ పేర్కొన్నారు. భారత్ రక్షణ రంగ తయారీ వ్యవస్థ సరికొత్త శిఖరాలను చేరుతోందని వెల్లడించారు. భారత్- స్పెయిన్ భాగస్వామ్యం సరికొత్త దిశగా ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. రతన్ టాటా ఉంటే ఈ కార్యక్రమం చూసి ఎంతో సంతోషించేవారని, ఈ కార్యక్రమం వల్ల రతన్ టాటా ఆత్మ సంతోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.