calender_icon.png 28 September, 2024 | 10:59 AM

ప్రధాని పూణె పర్యటన రద్దు

26-09-2024 11:16:39 AM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పూణే పర్యటన రద్దు చేసుకున్నారు. భారీ వర్షల కారణంగా ప్రధాని పర్యటన రద్దు అయినట్లు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. నగరంలో ఇతర అభివృద్ధి పనులతో పాటు సివిల్ కోర్టును స్వర్గేట్‌కు అనుసంధానం చేస్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భూగర్భ మెట్రో కారిడార్‌ను ప్రారంభించేందుకు ఆయన నగరాన్ని సందర్శించాల్సి ఉంది. పూణే దాని పరిసర ప్రాంతాలు బుధవారం నుండి భారీ వర్షం కారణంగా, ట్రాఫిక్ స్తంభించిపోయింది. పుణెలో బుధవారం 130 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల కారణంగా అన్ని పాఠశాలలను గురువారం మూసివేయాలని పుణె జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే బుధవారం రాత్రి ఆదేశించారు.