calender_icon.png 23 February, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్‌కీ బాత్‌లో ఆదిలాబాద్ ఉపాధ్యాయుడిని ప్రశంసించిన మోడీ

23-02-2025 02:29:15 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి కృత్రిమ మేధస్సు (AI) ప్రాముఖ్యతను ప్రస్తావించారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి కొలామి గిరిజన భాషలకు లిపి, సంగీతం సమకూర్చడంలొ తొడసం కైలాష్ చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. అంతరించిపోతున్న భాష పరిరక్షణ, ప్రచారానికి దోహదపడుతూ, కొలామిలో ఒక పాటను కంపోజ్ చేయడానికి ఉపాధ్యాయుడు ఏఐ సాధనాలను విజయవంతంగా ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల, తాను ఒక పెద్ద ఏఐ సమావేశంలో పాల్గొనడానికి పారిస్‌ను సందర్శించినట్లు చెప్పారు. అక్కడ ఈ రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని ప్రపంచం ఎంతో ప్రశంసించిందని ప్రధాని మోదీ అన్నారు.