న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రష్యా పర్యటనకు బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగనున్న 16వ బ్రిక్స్ సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. అయితే ప్రధాని మోదీ రెండు రోజులపాటు రష్యాలో పర్యటిస్తారు. ప్రధానికి రష్యాలో ప్రవాస భారతీయులు స్వాగతం పలకనున్నారు. బ్రిక్స్ సదస్సు ప్రపంచ అభివృద్ధి అజెండాకు ప్రతీక అని ప్రధాని మోదీ తెలిపారు. వివిధ అంశాలపై చర్చలకు బ్రిక్స్ సదస్సు ముఖ్యమైన వేదిక అన్నారు. బ్రిక్స్ లో సన్నిహిత సహకారానికి భారత్ విలువ ఇస్తుందని మోదీ తెలిపారు.