calender_icon.png 27 October, 2024 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాకు బయల్దేరిన ప్రధాని మోడీ

08-07-2024 12:01:44 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరారు. భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు భాగంగా ప్రధాని మోడీ మాస్కో పర్యటన ఖరారైంది. పుతిన్ తో పలు అంశాలపై ప్రధాని వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు రష్యా రాజధాని నగరం మాస్కోకు తన విమానంలో బయలుదేరే ముందు ప్రధాని నరేంద్ర మోడీ, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. పీఎం మోడీ సోమవారం మధ్యాహ్నం మాస్కోకు చేరుకుంటారు. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి.