14-02-2025 12:55:44 AM
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
కామారెడ్డి , ఫిబ్రవరి 13 (విజయక్రాంతి); రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ స్టేషన్ల ముసాయిదాలో ఎలాంటి అభ్యంతరాలు సలహాలు ఉంటే తెలపవచ్చు అని ఎంపీ డీవో ప్రవీణ్ కుమార్ గురువారం తెలిపారు.
పోలింగ్ స్టేషన్ ల ముసాయిదా జాబితా లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో మండల పరిషత్ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. తుది జాబితా ఈ నెల 15న ప్రచురించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ , వివిధ పార్టీల నాయకులు అబ్రబోయిన స్వామి ,అనంత్ రెడ్డి, సీతారాం మధు, స్వామి, నల్లపు శ్రీను ,రాజేష్, నాగరాజు, షమ్మీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.