calender_icon.png 15 October, 2024 | 5:47 PM

పిట్టల రాములు మృతి.. పార్టీకి తీరని లోటు

15-10-2024 03:39:50 PM

హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన పిట్టల రాములు సోమవారం గుండెపోటు తో మరణించారు. ఈ సందర్భంగా  ఆయన భౌతిక కాయానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కుమార్ సీపీఐ పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. మందాపవన్ మాట్లాడుతూ.. పిట్టల రాములు పార్టీ కోసం ఎంతో సేవ చేశారు అని ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పార్టీ రాములు కుటుంబానికి అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోయడ భాస్కర్ కోయాడ సృజన్ కుమార్ జాగిరి సత్యనారాయణ ఎగ్గోజు సుదర్శన్, మహిళా సమాఖ్య అధ్యక్షరాలు యాద పద్మ తదితరులు పాల్గొన్నారు.