calender_icon.png 18 October, 2024 | 12:09 AM

కొమరం భీంకి నివాళి

17-10-2024 09:03:02 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని కొమరం భీం విగ్రహానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నివాళి అర్పించారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన వీరుడు కొమరం భీం అని కొనియాడారు. ఆయన స్పూర్తితో ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు, ఆదివాసి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.