calender_icon.png 28 October, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ

13-08-2024 12:32:48 PM

మంచిర్యాల: నస్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలోని భవిత కేంద్రంలో మంగళవారం దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు దివ్యాంగ విద్యార్థులు ఈ భవిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ జాడి పోచయ్య కోరారు. ఫిజియోథెరపీ కోసం 99480 79070, 88971 75096లలో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ శ్రీకర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.